నిర్మాతల జీవితాలతో ఆడుకుంటున్న మహేష్‌, బన్నీ

మహేష్‌బాబు సరిలేరు నీకెవ్వరు మరియు అల్లు అర్జున్‌ అల వైంకుఠపురంలో సినిమాలు సంక్రాంతి కానుకగా ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

ఈ రెండు సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్‌తో అన్ని విధాలుగా హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో నిర్మాణం జరిగింది.

అంతా బాగానే ఉంది కాని సినిమాలు రెండు కనీసం రెండు మూడు రోజుల గ్యాప్‌లో అయినా రావాల్సి ఉంది.

"""/" /రెండు సినిమాలు ఒకే రోజున విడుదల అవ్వడం వల్ల రెండు సినిమాలకు కూడా నష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఎందుకంటే సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుండి కూడా సరిలేరు నీకెవ్వరు సినిమాను చూడాలని ప్రతి ఒక్కరు అనుకున్నారు.

కాని అదే రోజున అల వైకుంఠపురంలో సినిమాను కూడా విడుదల చేయడం వల్ల కొందరు అటు మరికొందరు ఇటు అన్నట్లుగా పంపిణీ అయ్యే అవకాశం ఉంది.

"""/" /నిర్మాతలు ఈ రెండు సినిమాల మద్య గ్యాప్‌ ఉంచాలని భావించారు.

కాని ఇద్దరు హీరోలు కూడా ఈగోలకు వెళ్లి సినిమా తేదీని మార్చేది లేదు అంటూ చెబుతున్నారు.

ఇద్దరు కూడా వెనక్కు తగ్గక పోవడంతో నిర్మాతలు బలి అయ్యే పరిస్థితి వచ్చింది.

నిర్మాతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.అలాగే బయ్యర్లు కూడా రెండు సినిమాలు ఒకే సారి అవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏం చేయబోతున్నారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.నిర్మాతలకు కోట్లల్లో నష్టం రానుందని టాక్‌ వినిపిస్తుంది.

ధనుష్-ఐశ్వర్య ఒకరినొకరు మోసం చేసుకున్నారు.. సుచిత్ర సంచలన వ్యాఖ్యలు వైరల్!