టార్గెట్ 30.. ఫిక్స్ చేసిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు మరో రెండు రోజుల్లో రిలీజ్‌కు రెడీ అయ్యింది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులకు మహేష్ అండ్ టీమ్ ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాతో పాత రికార్డులకు పాతర వేయాలని మహేష్ బాబు చూస్తున్నాడు.అదిరిపోయే కథతో వస్తున్న మహేష్ బాబు, సరిలేరు నీకెవ్వరు చిత్రం రిలీజ్ రోజునే అదిరిపోయే కలెక్షన్లు కొల్లగొట్టాలని చూస్తోంది.

ఓపెనింగ్ రోజునే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏకంగా రూ.

30 కోట్ల మేర వసూళ్లు సాధించాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.మహేష్ పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉండటంతో ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇకపోతే ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీఎంట్రీ కూడా ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని మిగిలిస్తుందని చిత్ర యూనిట్ అంటున్నారు.

రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో 30 నిమిషాలపాటు సాగే ట్రెయిన్ సీన్ అద్భుతంగా ఉంటుందని, ఆ సీన్‌ను ఎవ్వరూ మిస్ కావద్దని చిత్ర యూనిట్ కోరుతోంది.

మరి తొలిరోజే 30 కోట్ల మేర వసూళ్లపై కన్నేసిన మహేష్ అండ్ టీమ్‌కు ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను తెచ్చిపెడుతుందో చూడాలి.

అమెరికా : కాలిఫోర్నియాలో ఘనంగా ‘‘హిమాచలీ నైట్ ’’ , అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు