యాక్షన్ ఎపిసోడ్ తో మొదలు పెడుతున్న మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సూపర్ హిట్ కాగా ఈ గ్యాప్ లో ఫ్యామిలీతో ఓ చిన్న జాలీ ట్రిప్ వేసి వచ్చారు మహేష్.

ఇక త్వరలో త్రివిక్రం తో సినిమా స్టార్ట్ చేయనున్నారు.తెలుస్తున్న సమాచారం ప్రకారం జూలై నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని అంటున్నారు.

త్రివిక్రం, మహేష్ హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ లోనే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

మహేష్ సినిమాలు మ్యాక్సిమం యాక్షన్ సీన్స్ తోనే స్టార్ట్ అవుతాయి.అది కూడా ఒక సెంటిమెంట్ అని చెప్పొచ్చు.

త్రివిక్రం తో సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాగా ఉంటుందని అంటున్నారు.ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించనున్నారు.

త్రివిక్రం సినిమా తర్వాత మహేష్ రాజమౌళితో సినిమా చేయనున్నారు.2023లోనే జక్కన్నతో మహేష్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

 రాజమౌళి సినిమాకు కథ సిద్ధమని ఓ పక్క అంటుంటే కథ విషయంలో ఇంకా డిస్కషన్స్ ఫైనల్ అవలేదని మహేష్ అంటున్నాడు.

అయ్య బాబోయ్.. సినిమా సీన్లకు మించి దొంగతనం..(వీడియో)