రాజన్న ఆలయంలో మహాశివరాత్రి జాతర వైభోపేతంగా నిర్వహిస్తాం

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఆలయ ఈవో డి కృష్ణ ప్రసాద్( D Krishna Prasad ) ఈరోజు ఆలయ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటన చేసి మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించారు.

మార్చి 8 వ రోజున మహాశివరాత్రి( Maha Shivratri ) సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారి సౌకర్యార్థము మంచినీటి వ్యవస్థ, క్యూ లైన్లు, ప్రసాదాల వితరణ, పారిశుద్ధ్యం పార్కింగ్ పనులను పరిశీలించారు .

ఈ సందర్భంగా జాతర సమీపిస్తున్నందున ఏర్పాట్లన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు.

వీరి వెంట ఆలయయ్యి, రాజేష్ డి ఈ రఘునందన్, ఎడ్ల శివ ఉన్నారు.

వైరల్ వీడియో: ఆడవాళ్లు అలర్ట్.. ఇలా సడన్‌గా టైరులో చున్నీ ఇరుక్కపోతే ప్రాణానికే ప్రమాదం..