మహాధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్( Kasani Gnaneshwar ) ఆధ్వర్యంలో తేదీ 4-9-2023 సోమవారం రోజున ఉదయం 10:30 గంటలకు హైదరాబాదు లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బిఆర్ఎస్ ప్రభుత్వం( Brs Party ) ఇచ్చిన హామీలు, వైఫల్యాలపై నిరసనగా మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి ఆవునూరి దయాకర్ రావు అన్నారు.

ఈ మహాధర్నా కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ( Siricilla Assembly Constituency ) పరిధిలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు,అనుబంధ సంఘాల నాయకులు,గ్రామ పట్టణ నాయకులు పాల్గొని ఈ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయలని కోరారు .

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు తీగల శేఖర్ ,మచ్చ ఆంజనేయులు,మాలోత్ సూర్యనాయక్, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మోతె రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మన సీనియర్ హీరోలు ఎప్పుడు అవే సినిమాలా బోరు కొట్టడం లేదా..?