కోదాడలో మహా రుద్రాభిషేకం

సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణంలో కట్టకొమ్ముగూడెం రోడ్డులో శ్రీమహాలక్ష్మీ దేవి అమ్మన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్ధం సమస్తప్రాణి కోటి ఆనందగా ఉండాలని 3000 కేజీల మట్టితో చేసిన శివలింగాన్ని ఏర్పాటు చేసి మహా రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు.

నాగ సాధువుల సమక్షంలో ఒక గంట పాటు జరిగిన ఈ మహా రుద్రాభిషేకానికి కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో పాటు వివిధ రాజకీయ పార్టీల,ప్రజా సంఘాల నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాగసాధువులు మాట్లాడుతూ త్వరలోనే ఎంతో మహిమ గల దివ్యక్షేతన్ని కోదాడలో ఘనంగా నిర్మించబోతున్నామని,దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

హైదరాబాద్ అబిడ్స్ లో ఘరానా మోసం.. రూ.200 కోట్లకు టోకరా