చెట్టు కింద రొమాన్స్ చేసుకుంటున్న ప్రేమ జంట… ఒక్కసారిగా డ్రోన్ రావడంతో

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.

దీంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎక్కడి జనసాంద్రత అక్కడే ఉండిపోవాలని పలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

అంతేకాక అవసరమైతే తప్ప జనాలను రోడ్లపైకి రాకండి అంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు.

దీంతో కొందరు ప్రేమికులు ఎడబాటును భరించలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.అయినప్పటికీ ఏకాంతంగా గడపడానికి కోసం నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లి పోలీసులకు మూడో కన్ను డ్రోన్లకి చిక్కుతున్నారు.

తాజాగా ఇద్దరు ప్రేమికులు ఏకాంతంగా గడపడం కోసం లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి తమ గ్రామానికి దూరంగా ఉంటున్న టువంటి అటవీ ప్రాంతంలోకి వెళ్లి సరస సల్లాపాలు సాగిస్తున్న విషయం  పోలీసుల డ్రోన్ కంట పడింది.

అయితే ఒక్క సారిగా ఈ డ్రోన్ చూసినటువంటి ప్రేమికులు అక్కడినుంచి చక చకా సర్దుకొని పరారయ్యారు.

ఈ విషయానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అంతేగాక నెటిజన్లు కూడా ఈ విషయంపై బాగానే ట్రోల్స్ చేస్తున్నారు.

మరోవైపు అవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం వినడం లేదు.

దీంతో రోజురోజుకీ దేశంలో కరోనా వైరస్ కేసులు ఎక్కువవుతున్నాయి.కాబట్టి దయచేసి ప్రజలను సామాజిక దూరం పాటిస్తూ తమ నివాసాలకే పరిమితం కావాలని పలు పోలీసులు అధికారులు, వైద్య అధికారులు కోరుతున్నారు.

వీడియో వైరల్: శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..