మేన‌త్త‌తో ప్రేమాయణం.. క‌ట్ చేస్తే దారుణం..

ప్ర‌స్తుత స‌మాజంలో వావి వ‌ర‌సలు మ‌రిచిపోయి మ‌రీ మ‌న‌షులు చేస్తున్న దారుణాలు చివ‌ర‌కు ప్రాణాల‌ను బ‌లి తీసుకుంటున్నాయి.

ఇప్ప‌టికే ఎన్నో విషాదాంత ఘ‌ట‌న‌లు మ‌నం చూస్తూనే ఉన్నాం.అయినా కూడా ఇలాంటి దారుణాలు మాత్రం ఆగ‌ట్లేదు.

త‌మ శారీర‌క సుఖం కోసం వ్యామోహంతో తప్పులు చేసి బ‌లైపోతున్నారు.ఇక అంతా అయిపోయాక అస‌లు విషయం బయటకు తెలియ‌డంతో ఏం చెయ్యాలో పాలుపోక ఆత్మ‌హ‌త్య‌లకు పాల్పడుతున్నారు.

ఇక ఇప్పుడు కూడా ఓ యువ‌కుడు చేసిన ప‌ని చివ‌ర‌కు దారుణానికి తెర తీసింది.

ఆ యువ‌కుడికి 19 ఏళ్లు ఉండ‌గా ఆయ‌న త‌నకు వ‌రుస‌కు మేనత్త అయ్యే మరో యువతితో ప్రేమను కొన‌సాగించాడు.

ఇక ఆమె కూడా ఒప్పుకోవ‌డంతో వీరి బంధం మ‌రింత బ‌ల‌ప‌డింది.ఇంకేముంది చివ‌ర‌కు శారీరక సంబంధం పెట్టుకున్నారు వీరిద్ద‌రు కూడా.

ఇందులో ట్విస్టు ఏంటంటే త‌న‌కంటే ఆ అమ్మాయి పెద్ద‌ది.ఇక ఇద్ద‌రి సంబంధం కార‌ణంగా ఆ యువ‌తి గర్భవతి అయ్యింది.

ఇక చివ‌ర‌కు విష‌యం పెద్దలకు తెలిసిపోయింది.దాంతో ఇరు కుటుంబీకులు వారిని పద్దతి మార్చుకోవాల‌ని ఇలాంటివి మంచివి కావంటూ మందలించారు.

కానీ వారు మాత్రం విన‌లేదు.ఎందుకంటే అప్ప‌టికే ఆమె క‌డుపులో ఆరు నెల‌ల పిండం పెరుగుతోంది.

ఈ ఘ‌ట‌న మధ్యప్రదేశ్‌లోని సీధీ జిల్లాలో ఆల‌స్యంగా వెలుగు చూసింది.ఇక కుటుంబీకులు కూడా స‌ద‌రు యువకుడిని ఇంటికి పిలిపిచ్చి మరీ న‌చ్చ‌జెప్పారు.

అయ‌తే ఈ విష‌యంలో యువతి కాస్త వెన‌క‌డుగు వేసినా కూడా యువకుడు అయితే ప‌ట్టు బ‌ట్టి ఆ యువ‌తినే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.

ఇక పెద్దల్ని ఎదిరించి తాము బ్ర‌త‌క‌లేమ‌ని అర్థం చేసుకున్న వారిద్ద‌రూ కూడా ద‌గ్గ‌ర్లోని వంతెన పైనుంచి దూకి సూసైడ్ కు పాల్ప‌డ్డారు.

దీంతో ఇరు కుంటుంబాలు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

రూ. వెయ్యి కోట్లు అడిగినట్లు నిరూపిస్తే రాజకీయాలు మానేస్తా.. వైఎస్ షర్మిల ఛాలెంజ్