మహబూబ్‎నగర్ జిల్లాలో ప్రేమ వేధింపులు.. యువతి ఆత్మహత్య

ప్రేమ పేరుతో చేస్తున్న వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.జిల్లాలోని చిన్నచింతకుంట మండలం ఉంద్యాల తండాలో పుష్పలత అనే యువతి ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది.

సాయి సందీప్, బాషా నాయక్ అనే ఇద్దరు వ్యక్తులు పుష్పలతను వేధించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మృతురాలి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ సింపుల్ రెమెడీతో దృఢమైన ఒత్తైన జుట్టును మీ సొంతం చేసుకోండి!