హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సాయి తేజ్ విషయంలో రియాక్ట్ అయిన లోకేష్..!!

తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో ఆర్మీ ఉన్నతాధికారి బిపిన్ రావత్ తో పాటు 11 మంది మరణించగా వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన సాయి తేజ్ కూడా ఉండటం జరిగింది.

ఈ నేపథ్యంలో సాయి తేజ్ మరణం పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో సాయితేజ్ మరణించడం బాధాకరమని పేర్కొన్నారు.

ప్రమాదం జరగడానికి  కొద్ది గంటల ముందు.అనగా ఉదయం కుటుంబ సభ్యులతో చివరిసారి మాట్లాడినట్లు తెలిసింది అని.

లోకేష్ చెప్పుకొచ్చారు.ఉదయం మాట్లాడిన సాయి తేజ్ సాయంత్రానికి.

ఇలా అయిపోయారు అంటే ఆ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఎంత ఆవేదన చెందుతున్నారో.

అది ఊహించడానికే కష్టంగా ఉందని అన్నారు.సాయి తేజ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు స్పష్టం చేశారు.

సాయి తేజ్ చిత్తూరు జిల్లా కుర‌బ‌ల‌కోట మండ‌లం ఎగువ‌రేగ‌డ గ్రామానికి చెందినవాడు.హెలికాప్టర్ ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్ ప్రమాద స్థలంలోనే మరణించినట్లు ఆర్మీ ప్రకటించడం జరిగింది.

సినిమా కోసం రెండేళ్లు తిరిగా.. భార్య జీతంతో బ్రతికా.. దిబాకర్ బెనర్జీ కామెంట్స్ వైరల్!