సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన లోకేష్..!!

టీడీపీ నాయకుడు పట్టాభి తాడేపల్లి దద్దమ్మ.చేత కానోడు.

పాలేగాడు అంటూ ఏకవచనంతో పరుష పదజాలంతో సీఎం జగన్ ని ఉద్దేశించి బూతులు మాట్లాడటం తెలిసిందే.

దీంతో పట్టాభి చేసిన వ్యాఖ్యల పట్ల వైసిపి పార్టీ శ్రేణులు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

ఇటువంటి తరుణంలో సీఎం జగన్ ఈరోజు "జగనన్న తోడు" కార్యక్రమంలో.చిరు వ్యాపారులకు డబ్బు జమ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ తాజా పరిస్థితులపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.

ప్రతిపక్షంలో తాను ఉన్న సమయంలో ఎప్పుడూ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదని.పేర్కొన్నారు.

ఇంత దారుణమైన బూతులు ఏనాడు కూడా మాట్లాడలేదని, తాను మాత్రమే కాక తన పార్టీలో ఎవరూ కూడా మాట్లాడలేదని పేర్కొన్నారు.

టీడీపీ వాలే బూతులు తిడతారు.ఎవరూ కూడా మాట్లాడాలని అన్యాయమైన రీతిలో మాట్లాడతారు.

ఈ రీతిలో.నేను ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎప్పుడు వ్యవహరించలేదని జగన్ అనటంతో లోకేష్ కౌంటర్ ఇచ్చారు.

అప్పట్లో జగన్ ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కాలర్ పట్టుకుని.ప్రశ్నించాలి అని అన్నది ఎవరు.

??, ముఖ్యమంత్రి చంద్రబాబు ని నడిరోడ్డుపై కాల్చి చంపాలి అని.ఎవరు వ్యాఖ్యలు చేశారు.

అంటూ జగన్ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు.

పురుషులు తలస్నానం చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ ను పాటిస్తే జుట్టు రాలమన్నా రాలదు!