బీఆర్ఎస్‎కు లోక్‎సభ సచివాలయం షాక్..!

బీఆర్ఎస్‎ పార్టీకి లోక్‎సభ సచివాలయం బిగ్ షాక్ ఇచ్చింది.టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారి నెలలు గడుస్తున్న లోక్‎సభ సచివాలయం నేటికీ ఆ పార్టీకి గుర్తింపు ఇవ్వలేదు.

అంతేకాదు లోక్‎సభ బీఏసీ నుంచి ఇప్పటికే టీఆర్ఎస్ ను తొలగించింది.సాధారణంగా ఆరుగురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్న పార్టీకి బీఎసీలో సభ్యత్వం లభిస్తుంది.

ఈ క్రమంలోనే బీఏసీ సభ్యుడిగా ఉన్న టీఆర్ఎస్ లోక్‎సభ పక్షనేత నామా నాగేశ్వరరావుకు ఆహ్వానం అందింది.

మంత్రిత్వ శాఖల వారీగా డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పై చర్చించేందుకు బీఏసీ సమావేశం నిర్వహిస్తున్నట్లు లోక్‎సభ సచివాలయం సమాచారం అందించింది.

అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ కు లోక్‎సభలో తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు.ఈ క్రమంలోనే లోక్‎సభ సచివాలయం ఆహ్వానితుల జాబితాలోకి తీసుకుంది.

చిన్నారికి ఆస్పత్రిలో చికిత్స చేయించిన బాలయ్య.. మంచి మనస్సున్న హీరో అంటూ?