Lok Sabha Elections : లోక్‎సభ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదల

లోక్‎సభ ఎన్నికలకు( Lok Sabha Elections ) తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ మేరకు తొలి విడతలో 21 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం( Election Commission Of India ) తెలిపింది.

దేశ వ్యాప్తంగా సుమారు 102 లోక్‎సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది.కాగా ఈ తొలిదశ నోటిఫికేషన్( First Phase Of Notification ) జారీతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

నామినేషన్లను దాఖలు చేసేందుకు ఈ నెల 27వ తేదీ వరకు సమయం ఉండగా.

ఈ నెల 28న నామినేషన్ల పరిశీలన జరగనుంది.అదేవిధంగా నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 30 వరకు గడువు ఉంది.

తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 19న నిర్వహించనుండగా.జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

వైరల్: రోడ్డుపై కారును పరుగులుపెట్టిస్తున్న మాజీ సీఎం..