తిరుపతిలో ఇంకా లభ్యంకాని ఐదుగురు విద్యార్థుల ఆచూకీ..!

తిరుపతిలో అదృశ్యమైన ఐదుగురు పదో తరగతి విద్యార్థుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.

నిన్న ఉదయం స్కూలు నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు కనిపించకుండా పోయారు.తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.

విద్యార్థుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.ఇందులో భాగంగా అన్ని స్టేషన్లకు అలర్ట్ మెసేజ్ లు ఇచ్చారు పోలీసులు.

అదేవిధంగా విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తున్నారు.అయితే నిన్న మధ్యాహ్నం సమయంలో విద్యార్థులు ఇన్‎స్టాగ్రామ్‎లో ఆన్ లైన్ లోకి వచ్చినట్లు గుర్తించారు.

కాగా మిస్సింగ్ వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.పరీక్షల్లో మార్కులు తక్కువగా రావడంతో ఓ విద్యార్థి ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్29, ఆదివారం 2024