CM Revanth Reddy : త్వరలోనే రైతులకు రుణమాఫీ..: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) చిట్ చాట్ లో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

మేడిగడ్డ బ్యారేజ్( Medigadda Barrage ) వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.ఈ మేరకు జ్యుడీషియల్ విచారణలో అసలు విషయాలు బయటకు వస్తాయని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ను ఆహ్వానిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

"""/" / 13వ తేదీన వారికి సమావేశం ఉంటే ప్రాజెక్టు సందర్శనకు మరో తేదీని ఖరారు చేస్తామన్నారు.

ఎప్పుడైనా బీఆర్ఎస్ ( BRS )నేతలను ప్రాజెక్టు వద్దకు తీసుకుని వెళ్లేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు.

అదేవిధంగా త్వరలోనే రైతులకు రుణమాఫీ ఉంటుందని ఆయన వెల్లడించారు.ఇందుకోసం బ్యాంకులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు.

మణిపూర్ : భారత సంతతి ప్రొఫెసర్‌పై కేసు నమోదు.. ఖండించిన కుకీ విద్యార్ధి సంఘం