ఇరాన్లో లైవ్ టీవీ హ్యాక్.. బ్లడ్ కలర్లో షాకింగ్ మెసేజ్..!
TeluguStop.com
ఇరాన్ ప్రభుత్వ టీవీని హ్యాక్టివిస్ట్ గ్రూప్ ఎడలత్-ఎ-అలీ శనివారం హ్యాక్ చేసింది.లైవ్ న్యూస్ షో సందర్భంగా ఆ గ్రూప్ ఒక ఫొటోతో పాటు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
మా యువకుల రక్తం మీ చేతులకు అంటుకుంది</emఅనే ఒక మాటతో పాటు ఖమేనీ ఫొటో టీవీ షోలో మధ్యలో వీరు షో చేశారు.
రాత్రి పూట తొమ్మిది గంటల వార్తా కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఇరాన్ పోలీసుల కస్టడీలో 22 ఏళ్ల మహ్సా అమినీ చనిపోయింది.
ఆమె మరణం తర్వాత ఆదేశాలకు విత్తనాలు నిరసనలు చెలరేగాయి.అయితే ఆ యువతితో పాటు మరో ముగ్గురు బాలికల ఫోటోలు కూడా తెరపై కనిపించాయి.
ఇరాన్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ అనేది ప్రైవేట్ యాజమాన్యంలోని యూకే ఆధారిత మీడియా సంస్థ.
ఈ సంస్థ ఈ వీడియో ఫుటేజీని ట్విట్టర్ వేదికగా పంచుకుంది.ఫొటోలతో పాటు, నిరసనల్లో పాల్గొనాలని ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చే సందేశం కూడా తెరపై కనిపించింది.
కాసేపటికే ఆ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.టీవీ షో లైవ్ అవుతున్న సమయంలో ఖమేనీ క్లిప్ ప్లే చేయబడింది.
అకస్మాత్తుగా, "మహిళలు, జీవితం, స్వేచ్ఛ" అనే నినాదాలతో వార్తల ప్రదర్శనకు అంతరాయం ఏర్పడింది.
ఇరాన్ అత్యున్నత నాయకుడితో పాటు అమిని, ఇతర ముగ్గురు అమ్మాయిల చిత్రాలు ప్రదర్శించబడ్డాయి.
అయితే ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఒక ఉద్యమం చేస్తోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
పోలీసులు అమ్మాయిని చంపేశారని ఇలాంటి ప్రభుత్వాలు తమకొద్దని యువత ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు అని సమాచారం.
ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.
నిర్మాతగా మారడంతో డబ్బంతా పాయె.. డిప్రెషన్లో ప్రముఖ టాలీవుడ్ హీరో..?