'లైగర్'కు 7 అభ్యంతరాలు తెలిపిన సెన్సార్.. అంతగా ఏమున్నాయంటే?

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'లైగర్'.

ఈ సినిమా కోసం ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.మరి వారి ఎదురు చూపులకు ఫలితంగా మరొక వారం రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.

విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినా తర్వాత వీరి ఎదురు చూపులు పీక్స్ కు చేరుకున్నాయి.

లైగర్ టీమ్ అంతా ప్రెజెంట్ ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.ఫ్యాన్ డమ్ పేరుతొ టీమ్ అంతా ఇండియా మొత్తం టూర్ వేస్తున్నారు.

"""/" /ఇదిలా ఉండగా హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.

సెన్సార్ వారు ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు 7 అభ్యంతరాలు తెలిపిందట.

ఎఫ్ వర్డ్ ఇంకా ఆ సిగ్నల్ కు సంకేతం చూపించే వాటికీ సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పారట.

మరి ఈ 7 అభ్యంతరాలను తొలగించిందో లేదంటే మ్యూట్ చేసిందో చూడాలి.ఇక ఎన్నో అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా పూరీ, విజయ్ కెరీర్ కు ఎలాంటి బూస్ట్ ఇస్తుందో వేచి చూడాల్సిందే.

Arvind Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ కస్టడీ పొడిగింపు