కుటుంబ పాలనకు చరమగీతం పాడతాం.. బండి సంజయ్

తెలంగాణలో గడీల, కుటుంబ పాలనకు చరమగీతం పాడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

రైతులకు బేడీలు వేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ నాయకులదేనని తెలిపారు.ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని బండి సంజయ్ పేర్కొన్నారు.

కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి రౌడీషీట్లు ఓపెన్ చేసినా భయపడేది లేదన్నారు.బీజేపీ కార్యకర్తల పేర్లు చెబితే బీఆర్ఎస్ భయపడుతోందని తెలిపారు.

ఇచ్చిన హామీలు ఒక్కటీ కేసీఆర్ నెరవేర్చలేదని తెలిపారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు.

100 ఎకరాల విస్తీర్ణంలో భారీ స్టూడియో నిర్మాణం.. పవన్ చొరవతోనే సాధ్యం!