అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దాం.. -సర్పంచ్ తర్రె ప్రభాలత మనోహర్..

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండల కేంద్రంలో బుధవారం అంబేద్కర్ వర్ధంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.

గ్రామ సర్పంచ్ సర్పంచ్ తర్రె ప్రభాలత మనోహర్( Tarre Prabhalata Manohar ) ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం ఏనలేని పోరాటాలుతో చెరగని ముద్ర వేసిన మహనీయుడు డాక్టర్ బి.

ఆర్ అంబేద్కర్ అని అన్నారు.ఈ దేశ సామాజిక వ్యవస్థ అధ్యయనంతో జాతీయ ఉద్యమ ప్రజల ఆకాంక్షల ప్రతిపాదించే రాజ్యాంగాన్ని అందించాలని అంబేద్కర్ సేవలు ఆలోచన లు మానవ మర్యాద కోసం సమాజం కోసం వ్యవస్థ నిర్మాణం కోసమే అని పేర్కొన్నారు.

అంబేద్కర్ ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు ఎంతో న్యాయం చేశారని,అంబేద్కర్ చూపిన మార్గంలో యువత నడవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

వాళ్లు ఎందుకు విడిపోయారో మీకు చెప్పాలా.. బ్రహ్మాజీ కామెంట్స్ వైరల్!