షర్మిల విజ్ఞతకే వదిలేస్తున్నా..: వైఎస్ అవినాశ్ రెడ్డి

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి( MP YS Avinash Reddy ) ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఇందులో భాగంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( PCC Chief YS Sharmila ) వ్యాఖ్యలకు అవినాశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

మనిషికి విచక్షణ జ్ఞానం ఉండాలని తెలిపారు.తమ గురించి ఎంత చెడ్డగా ప్రచారం చేసుకుంటారో చేసుకోండన్న ఆయన షర్మిల విజ్ఞతకే వదిలేస్తున్నానని వెల్లడించారు.

అయితే నిన్న బస్సు యాత్రను ప్రారంభించిన షర్మిల సీఎం జగన్ తో పాటు వైఎస్ అవినాశ్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.

మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని హత్య చేసిన నిందితుడు అవినాశ్ రెడ్డి ఓ వైపు, రాజన్న బిడ్డ మరోవైపు ఉందన్న షర్మిల ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరిన సంగతి తెలిసిందే.

జగన్ ఢిల్లీ ధర్నా ఎఫెక్ట్ … ఆ భవన్ గేట్లు మూసివేత