ముఖ్యమంత్రి పి ఆర్ ఓ ను కలిసిన టి ఎన్ జి ఓస్ నాయకులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పి ఆర్ ఓ గా నియమితులైన ఎల్లారెడ్డిపేట మండలంలోని నారయణపూర్ కు చెందిన బోల్గం శ్రీనివాస్ గౌడ్ ని హైదరాబాద్ లోని అతడి నివాస గృహంలో టిఎన్జిఓస్ జిల్లా అద్యక్షులు ఎలుసాని ప్రవీణ్ యాదవ్ ఆధ్వర్యంలో శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు బుగ్గ కృష్ణ మూర్తి, గంట రవి గౌడ్, పర్శరాం రెడ్డి, పాముల స్వామి గౌడ్, ఎల్లారెడ్డి పేట సింగిల్ విండో డైరెక్టర్ గోగురి ప్రభాకర్ రెడ్డి ,షకీల్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ప్రాంత అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లాలని శ్రీనివాస్ గౌడ్ ను కోరగా తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని ఆయన అన్నారు.

దేవర సెప్పినాడంటే చేస్తాడని.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సినిమాల్లో నటిస్తున్నాడుగా!