మహేష్ ఫ్యాన్స్ కు జక్కన్న షాకింగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారా.. ఏం జరిగిందంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) అలాగే రాజమౌళి( Rajamouli ) కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ఇంకా మొదలే కాలేదు.కానీ ఈ సినిమాపై మాత్రం భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.ఆప్రిక‌న్ అడ‌వుల బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది.

ఇప్ప‌టికే స్టోరీ లాక్ అయింది.మ‌హేష్ జ‌పాన్ లో ప్ర‌త్యేకంగా సినిమాకి అవ‌స‌ర‌మైన‌ ట్రైనింగ్ కూడా ముగించారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా వేగంగా జ‌రుగుతున్నాయి.

ఇక రెగ్యుల‌ర్ షూట్ మొద‌ల‌వ్వ‌డ‌మే ఆల‌స్యం. """/" / అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ ఆర్ ఎఫ్ సీలో మొద‌లైంది.

కానీ ఇది రెగ్యుల‌ర్ షూట్ కాదట.కేవలం డ‌మ్మీ షూట్ అట.

రిహార్స‌ల్స్ నేప‌థ్యంలో కొంత మంది న‌టుల‌పై ఇలా డ‌మ్మీ షూట్ చేస్తున్నారట.ఆఫ్రిక‌న్ బ్యాక్ డ్రాప్( African Backdrop ) డ‌మ్మీ సెట్లు నిర్మించి వాటిలో షూట్ చేసి జ‌క్క‌న్న అన్నీచెక్ చేసుకుంటున్నాడు.

చిన్న సెటప్‌లో సెట్స్, గుర్రాలను, అవ‌స‌ర‌మైన న‌టుల్ని తీసుకొచ్చి ఇలా రిహార్స‌ల్స్( Rehearsals ) చేస్తున్నార‌ని స‌మాచారం.

అందులో తప్పు ఒప్పుల‌ను ఇప్పుడే స‌రి చేసుకుని రెగ్యుల‌ర్ షూట్ కి ఎలాంటి అవాంత‌రం ఏర్ప‌డకుండా ముందు జాగ్ర‌త్త‌గా జ‌క్క‌న్న ఇలాప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

"""/" / ఈ విష‌యంలో రాజ‌మౌళి ప్లానింగ్ ఎంతో ప‌క్కాగా ఉంటుంది.షూట్ మొద‌లైన త‌ర్వాత ఎలాంటి డిస్ట‌బెన్స్ లేకుండా ప‌నిచేయ‌డం ఆయ‌న స్టైల్.

అందుకే ఆయ‌న ముందుగానే న‌టీనటులంద‌ర్నీఒకే తాటిపైకి తీసుకొచ్చి వ‌ర్క్ షాప్ లు నిర్వ‌హిస్తుంటారు.

అయితే చాలామంది మహేష్ బాబు అభిమానులు ఇది నిజమైన షూట్ అని అనుకున్నారు.

కానీ అది నిజం కాదట అది డమ్మీ షూట్ అని తెలుస్తోంది.తొందరగా ఈ సినిమాను పట్టాలెక్కించాలని భావిస్తున్నారు మూవీ మేకర్స్.