మనోడి విషయంలో తోక ముడిచిన పాక్‌

చాలా సంవత్సరాలుగా పాకిస్థాన్‌ జైల్లో మగ్గుతున్న ఇండియన్‌ నౌకాదళ మాజీ అధికారి కుల్‌ భూషన్‌ జాదవ్‌కు ఊరట లభించింది.

పాకిస్తాన్‌ ఆర్టీ కోర్టు కుల్‌ భూషన్‌కు ఉరి శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకోగా ఆ తీర్పును ఇండియా అంతర్జాతీయ న్యాయస్థానం ముందుకు తీసుకు వెళ్లింది.

అక్కడ సుదీర్ఘ వాదనలు వినిపించిన నేపథ్యంలో ఎట్టకేలకు అంతర్జాతీయ కోర్టు పాకిస్తాన్‌ వేసిన ఉరి శిక్ష చెల్లదు అంటూ తీర్పు ఇవ్వడం జరిగింది.

ఆ తీర్పును పాకిస్తాన్‌ ఖచ్చితంగా శిరసా వహించాల్సిందే అంటూ ఆదేశాలు వచ్చాయి.పాకిస్తాన్‌ పార్లమెంటులో ఆ విషయమై చర్చలు జరిపి అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నట్లుగా పాకిస్తాన్‌ ముఖ్యమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించాడు.

తాము జాదవ్‌ ఉరి శిక్షను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించాడు.అయితే ఆయన్ను విడిచి పెట్టే విషయమై మాత్రం ఎలాంటి అధికారిక క్లారిటీ ఇవ్వలేదు.

ఎన్నో ఏళ్లుగా ఆయన కుటుంబ సభ్యులు పాకిస్తాన్‌ ప్రభుత్వంకు విజ్ఞప్తులు చేస్తున్నారు.అలాగే ఇండియన్‌ ప్రభుత్వం కూడా పాకిస్తాన్‌ తో చర్చలు జరుపుతుంది.

అయినా కూడా వర్కౌట్‌ అవ్వడం లేదు.