లాల్ దర్వాజ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం.. మంత్రి తలసాని

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

హైదరాబాద్ చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలోని ఉప్పుగూడలో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణ పనులను ఇవాళ ఆయన ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి, సంస్కృతి- సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

ఈ క్రమంలోనే రూ.10 కోట్లతో లాల్ దర్వాజ ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.

ఏపీలో జోరుగా సీఎం జగన్ ప్రచార యాత్ర..!