మోడీ ఒక్క హామీ నెరవేర్చలేదు అంటూ కేటీఆర్ వైరల్ కామెంట్స్..!!

ఇటీవల ఫిబ్రవరి ప్రారంభంలో ఎప్పుడైతే పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిందో.

అప్పటి నుండి టిఆర్ఎస్ పార్టీ కీలక నాయకులు బీజేపీ తీరుపట్ల తీవ్రస్థాయిలో మండిపడుతున్న సంగతి తెలిసిందే.

బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని.సీఎం కేసీఆర్.

బీజేపీ  తీరు పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు.తెలంగాణ పట్ల కేంద్రానికి ఎందుకు అంత వివక్ష అని కూడా ప్రశ్నించడం జరిగింది.

ఇక ఇదే సమయంలో తెలంగాణ మంత్రులు కూడా బీజేపీ పార్టీ పై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

దీనిలో భాగంగా ఈరోజు మంత్రి కేటీఆర్ మరోసారి బీజేపీ పై విమర్శల వర్షం కురిపించారు.

కేంద్రానికి తెలంగాణ ప్రాజెక్టుల పట్ల ఎందుకీ వివక్ష అని ప్రశ్నించారు.తెలంగాణ పుట్టుక ను ప్రశ్నించిన బీజేపీకి.

రాష్ట్రంలో పుట్టగతులు ఉండాలా? అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు.ఇదే సమయంలో తెలంగాణపై ఇచ్చిన ఏ ఒక్క హామీలు కూడా ప్రధాని మోడీ నెరవేర్చలేదని అన్నారు.

జీవితాలు మార్చే జీవిత బీమా కూడా కేంద్రం అమ్మేసింది.అని Lic నీ ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

అవకాశం ఇస్తే మళ్లీ ఆంధ్రాలో తెలంగాణ కలవడానికి రెడీగా ఉన్నారని.ఆరోపించారు.

దేశంలో పొలిటికల్ మైలేజ్ సంపాదించడం కోసం బీజేపీ .యువకులను.

విద్యార్థులను రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తుందని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మోక్షజ్ఞ సినిమాలో నటించనున్న బాలయ్య…ఇక రచ్చ రచ్చే…