చంద్రబాబు పై కేటీఆర్ సానుభూతి ! రాజకీయం అంటే ఇదేగా 

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేది ఎన్నో సందర్భాల్లో రుజువు అయింది.

  ఇదే విధంగా అవకాశం దొరికినప్పుడల్లా తెలుగుదేశం పార్టీ పైన ,ఆ పార్టీ అధినేత చంద్రబాబుపైన విమర్శలు గుప్పిస్తూ వచ్చే బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ , మంత్రులు కేటీఆర్( KTR ) , హరీష్ రావు వంటి వారు ఇప్పుడు వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీపై సానుభూతి చూపిస్తూ , చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పై స్పందిస్తున్నారు .

అంతేకాదు ఒక అడుగు ముందుకు వేసి మరి ఏపీ అధికార పార్టీ వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.

దీంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, సానుభూతిపరుల ఓట్లను బిఆర్ఎస్ వైపుకు మళ్లించేందుకు తాజాగా మంత్రి కేటీఆర్ టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు ( Chandrababu Arrest )వ్యవహారంపై స్పందించారు.

"""/" / చంద్రబాబు అరెస్టు మానవీయ కోణంలో సరికాదంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.వ్యక్తిగతంగా చూసిన 73 ఏళ్ల వయసున్న చంద్రబాబును అరెస్టు చేయడం సరికాదని ఈ విషయం తెలిస్తే ఎవరైనా అయ్యో పాపం అని అంటారని కేటీఆర్ చెప్పారు.

చంద్రబాబు భద్రతపై లోకేష్ ఆందోళన వ్యక్తం చేయడం సరైనదేనని కేటీఆర్ అన్నారు .

గతంలో తాము తెలుగుదేశం పార్టీని విమర్శించిన మాట వాస్తవమేనని , 2018 లో కాంగ్రెస్ పార్టీతో టిడిపి పొత్తు పెట్టుకుందని,ఆ కోపం తోనే తాము టిడిపి పై విమర్శలు చేసామని కేటీఆర్ ( KTR )అన్నారు.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని,  2023 ఎన్నికల్లో టిడిపి పోటీ చేయడం లేదు కాబట్టి,  ఆ పార్టీపై విమర్శలు చేసేందుకు అవకాశం లేదని కేటీఆర్ అన్నారు.

"""/" / దీంతో కేసీఆర్, కేటీఆర్,  హరీష్ రావు( Harish Rao ) తదితరులు టిడిపి సానుభూతిపరుల ఓట్లను బీఆర్ఎస్( BRS ) వైపుకు మళ్లించేందుకు ఇప్పుడు టిడిపి ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై ఎక్కడలేని ప్రేమ కురిపిస్తున్నారని,  మొన్నటి వరకు ఏపీ అధికార పార్టీ వైసీపీతో అంట కాగిన బీఆర్ఎస్ ఇప్పుడు ఆకస్మాత్తుగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అక్కడి ప్రభుత్వం పైన , జగన్ పరిపాలన పైన విమర్శలు చేస్తూ తెలంగాణను టిడిపి ఓటు బ్యాంకును తమ పార్టీ వైపుకు డైవర్ట్ చేసుకోవాలనే ప్లాన్ తో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారనే అభిప్రాయాలు జనాల్లోనూ వ్యక్తం అవుతున్నాయి.

హెజ్‌బొల్లా అధినేత నస్రల్లా హతం.. ఇజ్రాయెల్‌పై డొనాల్డ్ ట్రంప్ అల్లుడు ప్రశంసలు