జ‌గ‌న్‌కు క‌రెక్టు టైమ్‌లో కేటీఆర్ మ‌ద్ద‌తు.. వైసీపీ రియాక్ష‌న్ ఏంటో..?

ప్రతి సారి ఏకాకిలా మారుతున్న ఏపీ సీఎం జగన్ కు కాస్త ఊరట లభించింది.

ఏపీ టీడీపీ నాయకుడు పట్టాభి జగన్ ను బూతులు తిట్టడం సరి కాదని పక్క రాష్ర్ట మంత్రి కేటీఆర్ అన్నారు.

అసలే టీఆర్ఎస్ కు వైసీపీకి కృష్ణా జలాల వివాదం నడుస్తున్న సమయంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామా రావు జగన్ కు సపోర్ట్ గా మాట్లాడడంతో అందరూ హ్యాపీగా ఫీలవుతున్నారు.

జగన్ మొదటి నుంచి రాజకీయాల్లో ఒంటరితనమే అనుభవిస్తూ వస్తున్నారు.ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగన్ ఏ రాజకీయనాయకులతోనూ పెద్దగా కలిసింది లేదు.

అందుకోసమేనేమో టీడీపీ ఆయన్ను టార్గెట్ చేస్తూ వస్తోంది.కానీ పట్టాభి విషయంలో మాత్రం జగన్ కు పెద్ద పాజిటివ్ ఎనర్జీ లభించినట్లయింది.

ఈ మధ్య జగన్ తాడేపల్లి లోని క్యాంప్ ఆఫీస్ వదిలి బయటకు రావడం లేదు.

రాజకీయాల్లో ఓడిపోయిన వారు వారు ఇలా స్థాయిని మరిచి బూతులు మాట్లాడడం సరైంది కాదని ప్రజలకు దగ్గరయ్యేందుకు మరింత ప్రయత్నించాలని ఆయన టీడీపీకి హితవు పలికారు.

ఆయన పరోక్షంగా జగన్ కు మద్దతు పలుకుతూ చేసిన ఈ కామెంట్స్ వైసీపీ శ్రేణులకు ఫుల్ కిక్ ఇచ్చాయి.

రాజకీయంగా అసహనం పెంచుకునే ఇలాంటి పనులు చేస్తున్నారు కావొచ్చు.అని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు.

కేవలం ఏపీలోని విపక్షాలకు మాత్రమే కాకుండా తెలంగాణలోని విపక్షాలకు కూడా కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఇప్పటికిప్పుడు అధికారంలోకి రావాలనే తొందర ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.వైసీపీని ఎలాగైనా సరే బ్లేమ్ చేసేందుకు చూస్తున్న టీడీపీకి కేటీఆర్ కౌంటర్లు ఇబ్బందికరంగా మారాయని పలువురు చర్చించుకుంటున్నారు.

అంతే కాకుండా టీడీపీ విషయంలో టీఆర్ఎస్ ఏమనుకుంటుందో కూడా ఈ పదాలు తెలుపుతున్నాయని పలువురు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం కేటీఆర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిగ్గా మారాయి.

Groom Viral Video : వీడియో వైరల్: పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు.. ఆస్పత్రి బెడ్ ఎక్కిన వైనం..!