కేటీఆర్ ఇలాకాలో బీజేపీ లో చేరికలు

భారతీయ జనతా పార్టీ( Bharatiya Janata Party ) జెండా ఆవిష్కరణ రాజన్న సిరిసిల్ల జిల్లా : భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి అధ్యక్షతన గొల్లపల్లి దేవుని గుట్ట తండా, బాకురు పల్లె తండా, గొల్లపల్లి గ్రామాల నుండి 50 మంది యువకులు బీజేపీ లో చేరారు.

అలాగే దేవుని గుట్ట తండాలో పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా అధ్యక్షుడు ప్రతాపరామకృష్ణ హాజరై మాట్లాడుతూ బీఆర్ఎస్ చేస్తున్న అవినీతి అక్రమాలను గడీల పాలను బద్దలు కొట్టడానికి భారతీయ జనతా పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయమని యువకులు గుర్తించి బిజెపి పార్టీలో యువకులు చేరడం జరిగిందని అన్నారు.

బిఆర్ఎస్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కార్యకర్తలు అందరూ పోరాటం చేయాలని నరేంద్ర మోడీ చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బిఆర్ఎస్ పాలను అంతమొందించాలని రాబోయే ఎన్నికలలో తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతుందని సిరిసిల్లలో కూడా కాషాయ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఏబీవీపీ రంజిత్ ఇంటి దగ్గర వారిని పరామర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లెగిసెట్టి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు,సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడేప్ రవీందర్ జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి, ఎంపిటిసి రజిత రవి నాయక్, ఎస్టి మోర్చా అధ్యక్షులు రవి నాయక్,రమేష్,చందుపట్ల రాజిరెడ్డి,కృష్ణ హరి, బొమ్మడి స్వామి, కిరణ్ నాయక్, దూస శ్రీను, బోనాల సాయికుమార్, కంచర్ల పరుశరాములు, నెవూరి శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్,ప్రశాంత్, రాజు, సంజీవరెడ్డి, రామ్ రెడ్డి, కృష్ణారెడ్డి, నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఫ్యామిలీతో వెకేషన్ లో చిల్ అవుతున్న బన్నీ… ఫోటోలు వైరల్!