'ఆదిపురుష్' షూటింగ్ తొందరగా స్టార్ట్ చేయమంటున్న కృతి !

బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన ప్రభాస్ ఈ సినిమా తర్వాత వరస పెట్టి అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.

బాలీవుడ్ హీరోలు సైతం ప్రభాస్ మార్కెట్ ను చూసి ఆశ్చర్య పోతున్నాయి.ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు ఐదు సినిమాలు ఉన్నాయి.

రాధే శ్యామ్ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.

ఈ సినిమాను జులై 30 న విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడే అవకాశాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి.

ఈ సినిమా తర్వాత ప్రభాస్ సలార్, ఆది పురుష్ సినిమాలు ప్రకటించి ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభించేసారు.

సలార్ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తుంది.

ఆదిపురుష్ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

రామాయణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు.

"""/"/ ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.

మళ్ళీ పరిస్థితులు చక్క బడిన తర్వాత షూటింగ్ కొనసాగుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.

"""/"/ సీతగా నటిస్తున్న కృతి ఈ సినిమా షూటింగ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న కృతి ఈ సినిమా మళ్ళీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని ఎక్సయిట్ అవుతుంది.

ఈ షూటింగ్ ను ఎంతగానే ఎంజాయ్ చేస్తానంటూ చెబుతూ.షూటింగ్ తొందరగా స్టార్ట్ చేద్దాం అంటూ ఓం రౌత్ ను కోరుతుంది.

భారతీయులు లేకుండా యూఎస్ టెక్ ఇండస్ట్రీ కష్టమే : సిలికాన్ వ్యాలీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీఈవో