మరో ఖరీదైన ఫ్లాట్ ను కొనుగోలు చేసిన ఆదిపురుష్ సీత.. ఫ్లాట్ ఖరీదు ఎంతంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్( Kriti Sanon ) గురించి మనందరికీ తెలిసిందే.

ఈమె బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.డార్లింగ్ ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన ఆది పురుష్( Adipurush ) సినిమాలో సీతగా( Sita ) నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువ అయింది.

ఈ సినిమా సక్సెస్ కాకపోయినప్పటికీ హీరోయిన్ కృతి సనన్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

ఒకవైపు సినిమాలలో హీరోయిన్ గా రాణిస్తూనే మరొకవైపు బిజినెస్లలో పెట్టుబడులు పెడుతూ బాగానే అర్జిస్తోంది.

అలా రెండు చేతుల సంపాదిస్తూ భారీగానే ఆస్తులు కూడా పెట్టింది ఈ ముద్దుగుమ్మ.

"""/" / ఇది ఇలా ఉంటే తాజాగా కృతి సనన్ మరొక ప్లాట్ కొనుగోలు చేసింది.

ఓవైపు నటిగా హిట్స్ కొడుతున్న ఈమె మరోవైపు బిజినెస్‌లోనూ( Business ) పెట్టుబడులు పెడుతోంది.

ఈ క్రమంలోనే తాజాగా ముంబైలోని అలీబాగ్( Mumbai Alibaug ) ప్రాంతంలో ఖరీదైన ఫ్లాట్ ని సొంతం చేసుకుంది.

అయితే ఈ మధ్య కాలంలో హీరోయిన్‌గా కృతి సనన్ బాగానే కలిసి వస్తోంది.

2023లో ఈమె చేసిన మూడు సినిమాలు సరిగా ఆడనప్పటికీ ఈ ఏడాది మాత్రం తేరే బాతోన్ మే ఐసా ఉల్జా జియా, క్రూ చిత్రాలతో హిట్ కొట్టింది.

గతేడాది రూ.35 కోట్లతో బంగళా, రెండు ఫ్లాట్స్ కొనుగోలు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు రూ.

2 కోట్ల విలువైన స్థలాన్ని సొంతం చేసుకుంది. """/" / ముంబైలోని అలీబాగ్ ప్రాంతంలో 2000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ ఫ్లాట్ ఉంది.

ది హౌస్ ఆఫ్ అభినందన్ లోదా అనే ప్రాజెక్టులోని ఫ్లాట్ ఇది.మొన్నీ ఈ మధ్య అమితాబ్ బచ్చన్ కూడా ఇందులోనే ఫ్లాట్ కొన్నారు.

ఇప్పుడు ఈ లిస్టులోకి కృతి సనన్ చేరింది.ఏదేమైనా చేతిలో డబ్బులు ఉన్నప్పుడే ఆస్తులు కూడబెట్టుకోవాలనే విషయాన్ని కృతి పక్కాగా ఫాలో అవుతున్నట్లుంది.

అందుకే డబ్బులు బాగా సంపాదిస్తూ వృధా ఖర్చులు చేయకుండా స్థలాలు ఇల్లు కొనుగోలు చేస్తోంది.

మేల్ ఇన్నెర్స్ ఆర్డర్ చేస్తే.. ఫిమేల్ ఇన్నెర్స్ పంపించిన బ్లింకిట్.. చివరికి..?