విజయ్-సమంత ‘ఖుషి’లో కృతి శెట్టి స్పెషల్ రోల్!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కలిసి జంటగా నటిస్తున్న సినిమా ఖుషి.

ప్రేమ కథలను తెరకెక్కించే డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను మరో అందమైన ప్రేమ కథగా మలుస్తున్నాడు.

కాశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథ ఇప్పటికే సగానికి పైగానే షూట్ పూర్తి చేసుకుంది.

గత కొన్ని నెలల క్రితం ప్రకటించి షూటింగ్ కూడా వెంటనే స్టార్ట్ చేసారు.

కాశ్మీర్ లో అందమైన లొకేషన్స్ తో పాటు వైజాగ్ బీచ్, హైదరాబాద్ లో కూడా ఈ సినిమా షూటింగ్ జరిగింది.

విజయ్ దేవరకొండ, సమంత జోడీగా నటిస్తున్నారు అంటే ఫ్యాన్స్ కు ఈ సినిమాపై బాగా ఆసక్తి కలిగింది.

ఈ సినిమాలో వీరిద్దరి జోడీ ఫ్రెష్ గా అనిపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అందుకే వీరిద్దరూ జంటగా నటిస్తున్న ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ తో పాటు సామ్ ఫ్యాన్స్ కూడా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

అయితే ప్రెజెంట్ సామ్ అనారోగ్యం కారణంగా ఈ షూట్ ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.

ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించ బోతుంది అని టాక్.ఆమె మరెవరో కాదు.

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి అని తెలుస్తుంది.ఈమె ఈ సినిమాలో సెకండాఫ్ లో కీలక పాత్రలో నటించ బోతుందట.

అంతేకాదు ఈమె క్యారెక్టర్ కూడా కొత్తగా ఉండబోతుందట. """/"/ నెగిటివ్ షేడ్స్ తో సాగే ఈ క్యారెక్టర్ చివరకు ఎమోషనల్ గా టర్న్ అవుతుందట.

మరి ఈమె క్యారెక్టర్ అంత ఇంట్రెస్టింగ్ గా ఎలా మలచబోతున్నాడు? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ వార్తపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ వస్తే కానీ అసలు విషయం తెలియదు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హీషమ్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా మీదనే ఇటు విజయ్, సమంత, అటు శివ నిర్వాణ ఆశలు పెట్టుకున్నారు.

మరి ఈ లవ్ స్టోరీ ఈ జోడీకి ఎలాంటి హిట్ అందిస్తుందో వేచి చూడాల్సిందే.

చంద్రబాబు మోసాలకు చెంప చెళ్లుమనిపించేలా సమాధానం చెప్పాలి..: సీఎం జగన్