కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు…

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రం లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో బుధవారం రోజున కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

పాఠశాలలోని చిన్నారులు దాదాపు 100 మంది కృష్ణ మరియ గోపిక వేషాదరణ తో ఆకట్టుకున్నారు.

10 వ తరగతి విద్యార్థులు ఉట్టి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ హరినాథ్ రాజు మాట్లాడుతూ హిందు సాంప్రాదాయాలను మరువకుండా విద్యార్థులకు గుర్తు చేసేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎలిగేటి నరేష్, డైరెక్టర్లు తీపి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎర్రం గంగ నరసయ్య,పడాల సురేష్,ఉపాధ్యాయులు విజయ్ కుమార్,సునీల్, సృజన్,రమేష్,సంధ్య,పూజ, టీచర్లు తదితరులు పాల్గోన్నారు.

ఇదేందయ్యా ఇది.. కేవలం ఆరడుగుల ప్రదేశంలో దంచికొట్టిన వాన.. వీడియో వైరల్..