‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ : ఒత్తిడికి తలొగ్గిన క్రిష్‌, అలా చేసేందుకు ఓకే

ఎన్టీ రామారావు బయోపిక్‌ ‘ఎన్టీఆర్‌’పై రోజు రోజుకు అంచనాలు పెరిగి పోతున్నాయి.బాలయ్య ప్రధాన పాత్రలో క్రిష్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

భారీ ఎత్తున ఈ చిత్రం షూటింగ్‌ను నిర్వహిస్తున్నారు.క్రిష్‌ చేయి ఈ సినిమాపై పడటంతో తప్పకుండా ఇదో ఛారిత్రాత్మక విజయాన్ని దక్కించుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

ఇక ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతున్న సమయంలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తూ, స్క్రిప్ట్‌ను మార్చాల్సి వస్తుంది.

కొందరికి కొన్ని సీన్స్‌ అనుకుంటే ఆ సీన్స్‌ ఎక్కువ అవుతున్నాయి.దాంతో సినిమా నిడివి చాలా ఎక్కువ అవుతుంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ సినిమా నిడివి ఎక్కువ అవుతున్న కారణంగా రెండు పార్ట్‌లుగా సినిమా విడుదల చేయాలని కొందరు సలహా ఇస్తున్నారు.

అయితే ఎన్టీఆర్‌ సినిమా విషయంలో అలా చేస్తే ప్రేక్షకులు సరిగా రిసీవ్‌ చేసుకోక పోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అందుకే క్రిష్‌ రెండు పార్ట్‌లుగా వద్దని భావిస్తున్నాడు.కాని చిత్ర యూనిట్‌ సభ్యులు కొందరు ఈ విషయమై ఆయన్ను ఒత్తిడి చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండు పార్ట్‌లుగా చేయాల్సిన పరిస్థితి వస్తుందని తెలుస్తోంది./br Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా రెండు పార్ట్‌లుగా సిద్దం అవుతుంది.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.క్రిష్‌తో పాటు బాలయ్య కూడా రెండు పార్ట్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో మొదటి పార్ట్‌ ఎలా ఉండాలి, రెండవ పార్ట్‌లో ఏం ఉండాలి అనే విషయాల గురించి చర్చ జరుగుతుంది.

/br రెండు పార్ట్‌లుగా తెలుగులో ‘బాహుబలి’, ‘రక్త చరిత్ర’ సినిమాలు వచ్చాయి.

అందులో బాహుబలి సంచలన విజయాన్ని సొంతం చేసుకోగా, రక్తచరిత్ర పర్వాలేదు అనిపించుకుంది.మరి ‘ఎన్టీఆర్‌’ చిత్రం ఎలాంటి ఫలితంను దక్కించుకుంటుందో అనే ఆసక్తి అందరిలో ఉంది.

సంక్రాంతికి మొదటి పార్ట్‌ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

వైట్ హౌస్ గేట్‌ను ఢీకొట్టిన వ్యక్తి.. కట్ చేస్తే మృతి..?