మంత్రి కేటీఆర్ ను కలిసిన కొరేం సింగిల్ విండో చైర్మన్ తీపి రెడ్డి కిషన్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా సింగిల్ విండో చైర్మన్ ల ఫోరం అధ్యక్షుడు, కోరేం సింగిల్ విండో చైర్మెన్ తీపిరెడ్డి కిషన్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ లో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిశారు.

ఈ సందర్భంగా ఆయన బోయినిపల్లి మండలం కోరేం గ్రామంలో గోదాం నిర్మాణం చేపట్టాలని వినతి పత్రం అందజేశారు.

రైతులకు పండించే ప్యాడి కి ప్రస్తుతం ఉన్న గోదాములు, రైస్ మిల్స్ సరిపోవడం లేదన్నారు.

కోరేం గ్రామం లో 20 వేల మెట్రిక్ టన్నుల కేపాజిటి తో గోదాం నిర్మిస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందనీ వినతి పత్రం లో పేర్కొగా గోదాం నిర్మాణానికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.

వైరల్: ఓరినాయనో.. ఇదేం వంకాయ రా బాబు.. బాహుబలి వంకాయలా ఉందే..