కొరటాల ప్లాన్స్ మాములుగా లేవుగా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను సంతోషపెట్టేలా..

''రౌద్రం రణం రుధిరం'' సినిమాతో పాన్ ఇండియా మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు.

ఈయన నటించిన ఈ మల్టీ స్టారర్ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

మరి ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అవ్వక ముందు ఎన్టీఆర్ కొరటాలతో సినిమా ప్రకటించాడు.

ఈ కాంబోపై అప్పటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాగానే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావించారు.

కానీ ఈ సినిమా వచ్చి కూడా ఏడాది కావొస్తున్నా కొరటాల-ఎన్టీఆర్ మూవీ స్టార్ట్ కాలేదు.

నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళక పోవడంతో తారక్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

అయితే కొరటాల శివ చాలా రోజుల వరకు స్క్రిప్ట్ కంప్లీట్ చేయక పోవడంతో ఈ సినిమా కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది.

"""/"/ ఇక ఇప్పుడు కొరటాల పక్క స్క్రిప్ట్ ను తారక్ కు వినిపించి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడు.

ఈ సినిమా వచ్చే ఏడాది 2024లో ఉంటుంది అని ఫిబ్రవరి నుండి షూట్ స్టార్ట్ కాబోతుంది అని అధికారికంగా ప్రకటన వచ్చింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ నెలలో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి నుండి స్టార్ట్ కానుంది అని తెలుస్తుంది.

"""/"/ ఇదిలా ఉండగా ఫ్యాన్స్ ను హర్ట్ చేయకుండా కొరటాల ప్లాన్ చేసుకున్నాడు అని ఆరు నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది.

అంతేకాదు ఫ్యాన్స్ కోసం రెగ్యురల్ గా అప్డేట్ ఇస్తూ వారికీ చిరాకు కలిగించకుండా పక్కా ప్లాన్ చేసుకున్నాడు అని ఈ సినిమా 2024, ఏప్రిల్ 5న ఖచ్చితంగా రిలీజ్ చేయనున్నారు అని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తుండగా.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

విదేశీ విద్యార్ధుల పనిగంటలపై ఆంక్షల దిశగా కెనడా..?