బిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు

రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మామిడిపెల్లి గ్రామం లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బొర్ర రవీందర్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం రెండవ సారి అధికారంలో కి వచ్చినాక ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చెయ్యకుండా విద్యార్థులను యువతను మోసం చేసిందన్నారు.

నిరుధ్యొగ భృతి ఇస్తా అని నిరుద్యోగులు నట్టేట ముంచిందని, అధికారం లో కి వచ్చినాక ఆ హామీ ని తుంగలో తొక్కడం జరిగిందన్నారు.

రాబోయే ఎన్నికలలో కెసిఆర్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి యువత సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

ఇట్టి కార్యక్రమంలో గ్రామ యువకులు,జిల్లా కార్యదర్శి నాగండ్ల భూమేష్,మండల ప్రధాన కార్యదర్శి అబ్బసాని దినేష్,అనిల్ యదవ్, శ్రీకాంత్, వేణు ,సాయి ,నరేష్,పవన్,మహేష్,మహేందర్ రెడ్డి, సలీం, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

వీడియో వైరల్: ఫోన్ ఇవ్వనందుకు తల్లిని బ్యాట్ తో చావబాదిన కొడుకు!