పోగొట్టుకున్న ఫోన్ ను అత్యధునిక టెక్నాలజీతో బాధితునికి అప్పగించిన కోనరావుపేట పోలీసులు

అత్యాధునిక టెక్నాలజీ సిఈఐఆర్ అప్లికేషన్( CEIR Application ) ద్వారా పోయినటువంటి ఫోన్ లను బాధితులకు అందిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ప్రజల మన్ననలు పొందుతున్నారు.

కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన బోల్లే ప్రతాప్ ఫోన్ పోయిందని కోనరావుపేట పోలీస్ స్టేషన్( Konaraopet Police Station ) లో ఫిర్యాదు మేరకు పోలీసులు సి ఈ ఐ ఆర్ అప్లికేషన్ ద్వారా రంగంలోకి దిగారు.

బాధితుడు పోగొట్టుకున్నటువంటి పొన్ ను అత్యధునిక టెక్నాలజీతో లోకేషన్ ద్వారా గమనించి కోనరావుపేట ఎస్సై రమాకాంత్ చేతుల మీదుగా చరవాణిని బాధితునికి అప్పగించారు.

దీనికి కృషి చేసిన కొనరావుపేట పోలీసులకు బాధితుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.

అచ్చం.. ‘త్రీ ఇడియట్స్’ సినిమాలో లాగే.. మొబైల్ ద్వారా డెలివరీ చేయించిన డాక్టర్..