కత్తి మహేష్ తన రేంజ్ ను మించి పవన్ ను తిట్టాడు.. ఇప్పుడు ఏమయ్యాడంటూ?

టాలీవుడ్ ప్రముఖ రచయితలలో ఒకరైన కోన వెంకట్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలు సినిమా సమయంలో పవన్ తో నాకు క్లోజ్ అయ్యారని ఆయన తెలిపారు.

నాగబాబు గారు నాకు క్లోజ్ అని ఆయన చెప్పుకొచ్చారు.కొంతమందిని తక్కువసార్లు కలిసినా చాలారోజుల నుంచి కలిసినట్టు అనిపిస్తుందని పవన్ ను కలిసిన సమయంలో నాకు అలా అనిపించిందని ఆయన తెలిపారు.

పంజా అనే సినిమాకు నేను ఉండాలని పవన్ కోరుకున్నాడని అయితే డైరెక్టర్ కథ చెప్పకపోవడంతో పాటు మరో రైటర్ తో పని చేస్తున్నానని చెప్పారని ఆయన తెలిపారు.

పవన్ ను నేను గురూ అని పిలుస్తానని ఆయన చెప్పుకొచ్చారు.పవన్ కు ఎప్పటినుంచో రాజకీయాలంటే ఆసక్తి అని ఆయన తెలిపారు.

పవన్ కు విప్లవ భావాలు ఎక్కువని కోన వెంకట్ అన్నారు.పవన్ తన పర్పస్ ఇంకొకటి ఉందని ఫీలయ్యేవారని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

పవన్ కళ్యాణ్ ను నేను బ్రదర్ లా భావిస్తానని కోన వెంకట్ తెలిపారు.

జగన్ నిజం చంద్రబాబు అబద్ధం కళ్యాణ్ అమాయకత్వం అని గతంలో నేను చెప్పానని ఆయన చెప్పుకొచ్చారు.

"""/"/లక్షల మందితో ఇంటరాక్ట్ అయితే మనకు తెలియకుండా మనలో కొన్ని శక్తులు వస్తాయని కోన వెంకట్ పేర్కొన్నారు.

కత్తి మహేష్ ఇష్యూ బయటకు వచ్చిన సమయంలో ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చి మాట్లాడిన వ్యక్తిని నేను మాత్రమేనని ఆయన తెలిపారు.

కత్తి మహేష్ నోటికొచ్చినట్టు మాట్లాడాడని అయితే చనిపోయిన వాళ్ల గురించి తప్పుగా మాట్లాడకూడదని కోన వెంకట్ చెప్పుకొచ్చారు.

కత్తి మహేష్ స్థాయికి మించిన మాటలు మాట్లాడాడని దారుణంగా కామెంట్లు చేశాడని ఇప్పుడు ఏమయ్యాడంటూ కోన వెంకట్ తెలిపారు.

కళ్యాణ్ విషయంలో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయని కోన వెంకట్ చెప్పుకొచ్చారు.

నువ్వా మాకు నీతులు చెప్పేది.. శ్యామలపై పవన్ ఫ్యాన్స్ దారుణమైన ట్రోల్స్ వైరల్!