ఏపీ డిప్యూటీ స్పీకర్గా కోలగట్ల వీరభద్రస్వామి
TeluguStop.com
ఏపీ డిప్యూటీ స్పీకర్గా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి నియమితులైయ్యారు.ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అసెంబ్లీ బలాబలాల రీత్యా టీడీపీ పోటీ చేయలేదు.ఈ నేపథ్యంలో ఎన్నిక ఫలితాన్ని అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.
ఈ సందర్భంగా కోలగట్లకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు.అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందించారు.
అనంతరం సీఎం జగన్ , మంత్రులు, ప్రతిపక్ష నేత అచ్చెన్నాయుడులు కలిసి కోలగట్లను సీటులో కూర్చొబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.