దర్శకుడు కోడి రామకృష్ణకి సీరియస్! వెంటిలేటర్ పై చికిత్స!

టాలీవుడ్ దర్శక దిగ్గజం.వందకి పైగా చిత్రాలకి దర్శకత్వం వహించిన అతి కొద్ది మంది దర్శకుల జాబితాలో చోటు సొంతం చేసుకున్న ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ ఈ రోజు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు.

దీంతో అతనిని గచ్చిబౌలిలో ఎఐజీ హాస్పిటల్ కి తరలించారు.ప్రస్తుతం అతనిని వెంటిలేటర్ పై వుంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది.

తెలుగు తెరపై కుటుంబ కథా చిత్రాలని అద్బుతంగా ఆవిష్కరించిన కోడి రామకృష్ణ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యారు.

తరువాత వెనుతిరిగి చూసుకునే అవకాశం లేకుండా ఎన్నో అద్బుతమైన చిత్రాలకి తెలుగు ప్రేక్షకులకి అందించారు.

ఇక టాలీవుడ్ కి గ్రాఫిక్స్ మాయాజాలం పరిచయం చేసిన మొదటి దర్శకుడుగా కోడి రామకృష్ణ పేరు నిలిచిపోతుంది.

అతను తెరకెక్కించిన అమ్మోరు సినిమా టాలీవుడ్ లో మొదటి గ్రాఫిక్స్ బేస్ సినిమా, తరువాత దేవి కూడా ఆయన కెరియర్ లో మరో అద్బుత చిత్రంగా నిలిచిపోయింది.

ఆ సినిమాతోనే ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ని టాలీవుడ్ కి పరిచయం చేసాడు.

ఇక ఆయన కెరియర్ లో అరుందతి సినిమా ఓ ప్రత్యెక స్థానం సంపాదించుకుంటుంది.

ఇదిలా వుంటే ప్రస్తుతం సత్యసాయి జీవిత కథని తెరపై ఆవిష్కరిస్తున్న కోడి రామకృష్ణ కొంత కాలం క్రితం పక్షవాతంతో హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకొని మరల మామూలు మనిషి అయ్యారు.

అయితే ఉన్నపళంగా మళ్ళీ ఆరోగ్యం విషమించడంతో హాస్పిటల్ లో చేర్చారు.

కాంగ్రెస్, బీజేపీ రైతు వ్యతిరేక పార్టీలు..: హరీశ్ రావు