కోదండరాంకు ఎమ్మెల్సీ .. బోనస్ గా మంత్రి పదవి ? 

తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటూ .

ఎక్కడా తనపై విమర్శలు, అసంతృప్తులు రాకుండా చూసుకుంటున్నారు.ముఖ్యంగా పదవుల విషయంలో ఎవరెవరికి కేటాయించాలనే విషయంలో క్లారిటీ గా ఉంటున్నారు.

తాను చేపట్టిన నియామకాల విషయంలో ఎటువంటి విమర్శలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలోని తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారికి,  ప్రజల్లో సానుకూలత ఉన్నవారికి కీలికమైన పదవులు కట్టబెడుతున్నారు.

దీనిలో భాగంగానే తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాం( Professor Kodandaram ) కు ఎమ్మెల్సీ పదం ఇవ్వడంతో పాటు,  మంత్రిని చేయాలనే ఆలోచనకు రేవంత్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

జనాల్లో కోదండరాంకు ఉన్న సానుకూలతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

"""/" / ఇదే విషయంపై పార్టీ పెద్దలకు నివేదిక ఇచ్చేరట.వారి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కోదండరాంకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి తరువాత మంత్రిని చేయాలని,  ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి .

వాటికి ఎన్నికలు జరుగుతున్నాయి .వాటిలో ఒకటి కోదండరాంకు కేటాయించనున్నారు అనే ప్రచారం జరిగింది.

అయితే కోదండరాం కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి , మంత్రిని చేస్తే తెలంగాణలో కాంగ్రెస్కు ఆదనపు బలం చేకూరుతుందని , ఉద్యమకారుల నుంచి , ప్రజల నుంచి సానుకూలత ఏర్పడుతుందని రేవంత్ అంచనా వేశారట .

"""/" / తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం కీలకపాత్ర పోషించడం , పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏ తాటిపైకి తీసుకువచ్చి కీలకంగా వ్యవహరించారు .

అయితే కోదండరాం కష్టాన్ని బిఆర్ఎస్ ( Brs )తమకు అనుకూలంగా మార్చుకుని కోదండరాం ను పక్కన పెట్టింది.

దీంతో కోదండరాంకు సరైన న్యాయం కాంగ్రెస్ లోనే జరిగిందనే అభిప్రాయాలు ప్రజల్లోకి వెళ్లాలంటే ఆయనకు ఎమ్మెల్సీ,  మంత్రి పదవి ఇవ్వడమే కరెక్ట్ అని రేవంత్ నిర్ణయించుకున్నారట.

చిరంజీవితో అకీరా ఫస్ట్ సినిమా… మెగా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్!