శివుడు తాండవం ఎవరిపై కోపంతో చేశారు.. విశ్వమే ఎందుకు కంపించింది..!
TeluguStop.com
శ్రావణమాసం( Shravanamasam ) ఎంతో పవిత్రమైన మాసం అని దాదాపు అందరికీ తెలుసు.
శ్రావణం శివుడికి చాలా ఇష్టమైనది.ఈ నెలలో భక్తిశ్రద్ధలతో శివారాధన( Shivaradhana ) చేసిన వారి అన్నీ కోరికలు ఫలిస్తాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.
శ్రావణ సోమవారాలు పగలు ఉపవాసం ఉండి ప్రదోష వేళ సాయంత్రం స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు చేస్తే విశేష ఫలితాలు ఉంటాయని ప్రజలు నమ్ముతారు.
శ్రావణంలో చేసే చిన్న పూజ కూడా పెద్ద ఫలితాలను ఇస్తుందని శాస్త్రం చెబుతుంది.
శ్రావణ మాసం శివారాధన చేసే వారికి చాలా విశిష్టమైనది.నిజానికి సనాతన ధర్మంలో శివరాధనకు చాలా ప్రత్యేక స్థానం ఉంది.
శివుడు ఎప్పుడూ ఉగ్రరూపం దాల్చిన ఖచ్చితంగా తాండవం నృత్యం చేస్తాడు.శివతాండవం( Shiva Tandav ) గురించి శివ పురాణాలలో విశేషంగా ప్రస్తావించారు.
భువనభోంతరాలను కదిలించేలా కోపం అత్యంత ప్రసన్నుడైన శంకరుడికి ఎందుకు కోపం వచ్చిందో ఇప్పుడు ఏం జరిగిందో తెలుసుకుందాం.
"""/" /
శివుడు తాండవం చేస్తున్నప్పుడు ఆయన కళ్ళు కోపంతో ఎర్రగా మారిపోతాయి.
పూర్తి విశ్వం ఒక్కసారిగా భయకంపితమవుతుంది.సతీదేవి తన తండ్రి నిర్వహించిన యాగానికి వెళ్ళినప్పుడు శివుడు అక్కడ తాండవం చేశాడు.
ఆ యాగ క్షేత్రంలో ఆమె తండ్రి శివుడుని అవమాన పడచడాన్ని తట్టుకోలేక యాగాగ్నిలో తనను తాను దహించి వేసుకుంది.
సతీదేవి ( Satidevi ) చేసిన ఆత్మాహుతి గురించి తెలుసుకున్న శివుడు కోపంతో ఊగిపోయాడు.
తన గుణాల్లో ఒక్కడైనా వీరభద్రుడుని పంపి ద్రాక్ష రాజు తల నరికించాడు. """/" /
తర్వాత ఆత్మహుతి చేసుకున్న సతిదేవి నీ ఒడిలోకి తీసుకొని అంతులేని కోపంతో తాండవం చేయడం మొదలు పెట్టాడు.
అది చూసి దేవతలు, రాక్షసులు విశ్వమంతా భయకంపితమైపోయింది.అంత భయంగా బ్రహ్మ దేవుడిని శరణు వేడుకున్నారు.
ఆయన అందరినీ విష్ణువును( Maha Vishnu ) వేడుకోమని సలహా చెప్పాడు.శివుడు రుద్రావతారంలో ఉన్నప్పుడు ఎదురుగా వెళ్లడం మంచిది కాదని అందరికీ హితువు చెప్పాడు.
సతీదేవి మృతదేహం ఆయన ఒడిలో ఉన్నంతకాలం ఆయన శాంతించడం జరగదని తన సుదర్శన చక్రంతో మృతదేహాన్ని కింద పడేశాడు.
అలా అమ్మవారి శరీరంలోని భాగాలు తెగి భూమి మీద పడిపోయాయి.అలా పడినా ప్రతి చోటా ఒక శక్తిపీఠం వెలిసింది అని చెబుతారు.
మొత్తం శరీరం కింద పడిపోవడం వల్ల మహాదేవుని కోపం తగ్గిపోయింది.
యంగ్ డైరెక్టర్ల ఫోకస్ అంత స్టార్ డైరెక్టర్లుగా మారడం కోసమేనా..?