నేరుగా ఓటిటిలో విడుదలవుతున్న ‘కిన్నెరసాని’ చిత్రం..

సెన్సేషనల్ సినిమాలతో రోజురోజుకీ తన స్థాయి పెంచుకుంటుంది జీ 5 సంస్థ.ఇప్పటికే ఒరిజినల్ వెబ్ సిరీస్‌లతో పాటు ఆసక్తికరమైన సినిమాలను నేరుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది జీ5.

తాజాగా మరో ఆసక్తికరమైన చిత్రాన్ని ఎక్స్‌క్లూజివ్‌గా జీ 5లో విడుదల చేయనున్నారు.కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన కిన్నెరసాని సినిమా హక్కులను జీ 5 సొంతం చేసుకున్నారు.

జూన్ 10న ఈ సినిమాను నేరుగా ఓటిటిలో విడుదల చేయనున్నారు.మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కిన్నెరసాని జీ5లో నేరుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

వేద అనే అమ్మాయి.తన తండ్రి కోసం వెతకడం చుట్టూనే ఈ సినిమా కథ అంతా తిరుగుతుంది.

అన్ శీతల్, కాశిష్ ఖాన్ హీరోయిన్లుగా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో రవీంద్ర విజయ్ విలన్‌గా నటించారు.

మరో కీలక పాత్రలో మహతి బిక్షు నటించారు.రమణ తేజ ఈ థ్రిల్లర్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించారు.

సాయి తేజ దేహరాజ్ ఆత్రేయస ఈ సినిమాకు కథ అందించారు.ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ బలంగా చెప్తున్నారు.

H3 Class=subheader-styleనటీనటులు:/h3p కళ్యాణ్ దేవ్, అన్ శీతల్, కాశిష్ ఖాన్,.రవీంద్ర విజయ్, మహతి బిక్షు తదితరులు H3 Class=subheader-styleసాంకేతిక నిపుణులు:/h3p దర్శకుడు: రమణ తేజ, నిర్మాత: రామ్ ప్రసాద్ తళ్లూరి, రైటర్: సాయి తేజ దేహరాజ్ ఆత్రేయస, ఎడిటర్: అన్వర్ అలీ లిరిసిస్ట్: కిట్టు విస్సాప్రగడ, బ్యానర్: SRT ఎంటర్‌టైన్మెంట్స్ .