సౌత్ లో మరొక సినిమాతో రాబోతున్న కియారా.. ఏ హీరోతోనో తెలుసా !

సౌత్ ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పరిచయం అవసరం లేని పేరు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగులోకి అడుగు పెట్టింది.

మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.తన అందం, నటన తో కుర్రకారు మనసును దోచుకుంది.

మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకోవడంతో తన కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది.

మహేష్ తో చేసిన సినిమా హిట్ అవ్వడంతో వెంటనే రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

దీంతో ఈ బ్యూటీ టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అందుకుంది.కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ ప్లాప్ అవ్వడంతో ఈ అమ్మడు మళ్ళీ తెలుగులో నటించలేదు.

అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ కియారా పేరు టాలీవుడ్ లో మార్మోగిపోతోంది.

"""/"/ ఈ మధ్య రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా పేరు మొదటి నుండి వినిపిస్తుంది.

కానీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన అయితే రాలేదు.అంతేకాదు ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమాలో చేయబోతున్నట్టు ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.

"""/"/ ఎన్టీఆర్ కొరటాల శివతో ఒక సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన తర్వాత ఈ సినిమా హీరోయిన్ గురించి వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో కూడా కియారా పేరు వినిపిస్తుంది.అయితే తాజాగా కియారా ఈ వార్తలపై స్పందించారు.

ఆమె సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ త్వరలోనే సౌత్ సినిమాల్లోకి మళ్ళీ వస్తునట్టు మెసేజ్ షేర్ చేసింది.

దీంతో కియారా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ ఫ్యాన్స్ లేకపోతే చిరు సినిమాలు ఆడవు.. గ్రంథి శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్!