ఆర్టీసీ బస్సులో మంటలు…తప్పిన పెనుప్రమాదం…!

సూర్యాపేట జిల్లా: ఖమ్మం డిపోకు చెందిన TS 04 Z 0198 నంబర్ గల ఆర్టీసీ (ఇంద్ర ఏసి) బస్సు బుధవారం తెల్లవారుజామున ఖమ్మం నుండి హైదరాబాద్ కు ప్రయాణికులతో బయలుదేరింది.

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రం వద్దకు రాగానే బస్సు సాంకేతిక లోపంతో ఆగిపోయింది.

బస్సులో ప్రయాణికులను మరో బస్సులో పంపించి, బస్సును రిపేర్ కోసం సూర్యాపేట డిపోకు తరలిస్తుండగా సూర్యాపేట ఖమ్మం రోడ్డు సమీపంలో బస్సులో ఒక్కసారిగా మంటలు లేచాయి.

అప్రమత్తమైన డ్రైవర్ ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకువచ్చారు.

అప్పటికే బస్సు పూర్తి స్థాయిలో మంటలకు అహుతైంది.షాట్ సర్కుట్ కారణంగానే బస్సులో మంటలు సంభవించినట్టు సంబంధిత అధికారులు తెలియజేశారు.

ఏమయిందిరా.. 46 పరుగులకే కుప్పకూలిన టీమిండియా