'బ్రహ్మాస్త్ర 2'లో కేజిఎఫ్ స్టార్.. ఈ వార్తపై క్లారిటీ వచ్చేసింది!

ఇటీవలే బాలీవుడ్ నుండి మరొక పెద్ద సినిమాగా బ్రహ్మాస్త్ర రిలీజ్ అయ్యింది.అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా నటించారు.

బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ విలన్ గా కనిపించింది.అలాగే అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో నటించారు.

అయితే ఈ సినిమా మూడు పార్టులుగా వస్తుంది అని ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే.

అందుకే చెప్పినట్టుగానే మొదటి పార్ట్ పూర్తి అవడంతో ఈ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సెకండ్ పార్ట్ తెరకెక్కించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమా పార్ట్ 1 భారీ ఓపెనింగ్స్ అందుకుంది.ప్లాప్ టాక్ వచ్చినా 200 కోట్ల క్లబ్ లోకి చేరి అందరిని ఆశ్చర్య పరిచింది.

అయితే బ్రేక్ ఈవెన్ అవ్వక పోవడంతో నష్టాలు అయితే తప్పలేదు.ఇది భారీ బడ్జెట్ తో రావడంతో చాలానే నష్టాలు వచ్చినట్టు తెలుస్తుంది.

"""/"/ ఏది ఏమైనా మేకర్స్ మాత్రం వెనక్కి తగ్గకుండా రెండవ పార్ట్ ను నిర్మించడానికి రెడీ అయ్యారు.

బ్రహ్మాస్త్ర - శివ్ పేరుతొ తెరకెక్కిన మొదటి పార్ట్ 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాడు డైరెక్టర్.

ఇక ఇప్పుడు బ్రహ్మాస్త్ర - దేవ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.మరి దీనికి కొనసాగింపుగా చేస్తున్న ఈ సీక్వెల్ లో ఇప్పటికే చాలా మంది బిగ్ స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా మరో స్టార్ హీరో పేరు కూడా ఈ సినిమాకు జత చేసి ప్రచారం చేస్తున్నారు.

మరి ఆ హీరో ఎవరో కాదు.కేజిఎఫ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యష్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు అంటూ వార్తలు సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం చేసారు.

మరి ప్రచారం జరుగుతున్న వార్తలో నిజం ఉందా లేదా అనే వార్తపై ఇప్పుడు క్లారిటీ లభిస్తుంది.

తాజాగా బాలీవుడ్ మీడియాతో కరణ్ జోహార్ మాట్లాడుతూ ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చిన్నట్టు తెలుస్తుంది.

తాము ఇంకా దేవ్ పాత్ర కోసం ఎవరిని సంప్రదించలేదని అవాస్తవాలు ప్రచారం చేయకండి అంటూ చెప్పారట.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై18, గురువారం 2024