మైత్రీ మూవీ మేకర్స్ లో సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

గత సంవత్సరం కెజిఎఫ్ సినిమా తో కన్నడ ఇండస్ట్రీ చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.

యష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ఏడు భాషల్లో రిలీజ్ అయిన మొట్టమొదటి కన్నడ చిత్రం గా చరిత్ర సృష్టించింది.

అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకున్న మొట్టమొదటి కన్నడ చిత్రంగా రికార్డులు కెజిఎఫ్ సృష్టించింది.

ప్రస్తుతం ఈ దర్శకుడు కెజిఎఫ్ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించడానికి ఉన్నాడు.ఇదిలా ఉండగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించడానికి సిద్ధమవుతున్నాడని టాక్ టాలీవుడ్ లో గత కొంతకాలంగా వినిపిస్తుంది.

అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియలేదు.ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ లో బడా నిర్మాతలుగా గుర్తింపు పొందిన మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయడానికి కమిట్ అయినట్లు తెలుస్తోంది.

కెజిఎఫ్ సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయని సమాచారం.

అయితే తెలుగులో తెరకెక్కబోయే ఈ సినిమాలో హీరో ఎవరు నటిస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది.

బ్రేక్‌ఫాస్ట్ లో బ్రెడ్ తింటున్నారా.. అయితే మీ ఆరోగ్యం ఖ‌తం!