మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాజీనామా లేఖలో కీలక అంశాలు

మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.ఈ క్రమంలో తన రాజీనామా లేఖను ఏఐసీసీ ప్రధాన అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపించారు.

రాజీనామా లేఖలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక అంశాలను పొందుపరిచారు.ఎన్నో అవరోధాలను ఎదుర్కొని కాంగ్రెస్ లో పని చేశానని పేర్కొన్నారు.

ఏనాడు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదని చెప్పారు.అయితే కొన్ని నెలలుగా జరుగుతున్న రాజకీయా పరిణామాలతో ఇక పార్టీలో ఇమడలేనని అర్థమైందని లేఖలో పేర్కొన్నారు.

అందుకే కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

నామినేటెడ్ పోస్టులపై మూడు పార్టీల్లోనూ పోటీ .. భారీ ఆశలతో బీజేపీ