ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆరోగ్యశ్రీలో కొత్తగా 809 చికిత్సలు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఆరోగ్య శ్రీ పథకంలో కొత్తగా 809 చికిత్సలను చేర్చినట్లు సీఎం జగన్ తెలిపారు.

వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

దీనిలో భాగంగా ఆరోగ్య శ్రీలో వైద్య చికిత్సలను పెంచారు.ఈ మేరకు ఆరోగ్య శ్రీ కింద మొత్తం చికిత్సల సంఖ్యను 3,255కు పెంచినట్లు సీఎం జగన్ తెలిపారు.

దీంతో వైద్యం ఖర్చు రూ.వెయ్యికి పైబడ్డ చికిత్సలు చేరాయి.

రాష్ట్రంలో ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని జగన్ వెల్లడించారు.అదేవిధంగా రోడ్డు ప్రమాదాల కారణంగా గాయపడిన ఇతర రాష్ట్రాల వారికి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సేవలు అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

రాజమౌళి ఓ పిచ్చోడు.. ప్రేమతో తారక్ చేసిన ఈ కామెంట్స్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే!