పొత్తులపై ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే కీలక వ్యాఖ్యలు

ఎన్నికల్లో పొత్తులపై ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే స్పష్టత ఇచ్చారు.పొత్తులతోనే 2024 ఎన్నికలకు వెళ్తామని చెప్పారు.

బీజేపీని ఓడించేందుకు భావసారూప్యం కలిగిన పార్టీలతో కలిసి పని చేస్తామని తెలిపారు.

రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు.